భారత సామాజిక ఆర్థిక సర్వే, కుల గణన

కేంద్ర ప్రభుత్వం 2015, ఆగస్టు 25న సామాజిక, ఆర్థిక, కుల గణనను విడుదల చేసింది. 2011లో సామాజిక, ఆర్థిక, కుల గణనను గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో నిర్వహించారు. ఇందులో మూడు మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయి.
సామాజిక ఆర్థిక, కుల గణనలో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం బహిర్గతం చేస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమ విధానా ల రూపకల్పనలో భాగంగా ఈ సమాచారా న్ని అన్ని శాఖలకు అందుబాటులో ఉంచుతాయి.సామాజిక, ఆర్థిక, కుల గణన డ్రాఫ్ట్ ప్రచురణ తర్వాత పట్టణాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా పరిశీలనకు పంపిస్తారు. అందులో వచ్చిన ఫిర్యాదుల ను పరిశీలించి, వాటిని సరిచేసిన తర్వాత దేశంలోని 640 జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి తుది నివేదికను విడుదల చేస్తారు.
  • గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది.
  • పట్టణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ చేపట్టింది.
  • కుల గణనకు సంబంధించిన సమాచార సేకరణను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టాయి.
  • గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011, జూన్ 29న సమగ్రసర్వే విధానంలో గడప గడపకు సామాజిక, ఆర్థిక, కుల గణనను ప్రారంభించింది.

సామాజిక ఆర్థిక, కుల గణన- ముఖ్యాంశాలు (2011- గ్రామీణ పట్టణ కుటుంబాల వివరాలు)
వివరాలు
భారతదేశం
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ రాష్ర్టం
మొత్తం కుటుంబాలు
24,49,21,406
1,22,70,164
82,44,441
మొత్తం గ్రామీణ కుటుంబాలు
17,97,87,454
93,44,180
56,43,739
గ్రామీణ కుటుంబాల శాతం
73.41%
76.15%
68.46%
మొత్తం పట్టణ కుటుంబాలు
6,51,33,952
29,25,984
26,00,702
పట్టణ కుటుంబాల శాతం
26.59%
23.85%
31.54%
మొత్తం జిల్లాలు
640
13
10 (31)
మొత్తం గ్రామ పంచాయతీలు
2,96,770
13,061
9,477
మొత్తం గ్రామాలు
6,44,648
17,521
10,582
మొత్తం పట్టణాలు
4,460
94
71
  • సామాజిక, ఆర్థిక, కుల గణన గణాంకాలు భారత సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలపడంతోపాటు విధానాల రూపకల్పన లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గ దర్శకంగా నిలుస్తాయి.
  • 2011 జన గణనను ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణన 2011-2012 మధ్య జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో 2013లో కూడా అంతిమ పరిశీలన జరిపారు.
  • సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జనాభా లెక్కలను నిర్వహిస్తారు. దీని ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచాలి. ఆర్థిక వ్యవస్థను స్థూలంగా అవగాహన చేసుకోవడమే దీని ముఖ్యోద్దేశం.

సామాజిక ఆర్థిక, కుల గణనలోని ఇతర అంశాలు
  • మన దేశంలోని మొత్తం కుటుంబాలు 24,49,21,406. ఇందులో గ్రామీణ కుటుంబాలు 17,97,87,454 (73.41%), పట్టణ కుటుంబాలు 6,51,33,952 (26.59%)
  • జాతీయ స్థాయిలో గ్రామీణ కుటుంబాలు 73.41% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ కుటుంబాలు 76.15%.
  • భారతదేశంలో మొత్తం 6,44,648 గ్రామాలుండగా, గ్రామ పంచాయతీలు 2,96,770 ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17,521 గ్రామాలుండగా, 13,061 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
  • తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 10,582 గ్రామాలుండగా, గ్రామ పంచాయతీలు 9,477 ఉన్నాయి,
  • భారతదేశంలో మొత్తం 4,460 పట్టణాలుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 94, తెలంగాణలో 71 పట్టణాలున్నాయి.
  • 56.25% గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయ భూమి లేదు.
  • 9.68% గ్రామీణ కుటుంబాల్లోని సభ్యులు మాత్రమే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కలిగి ఉన్నారు.
  • 1.61% కుటుంబాలు వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తున్నాయి.
  • 75% గ్రామీణ కుటుంబాల్లోని వ్యక్తుల నెలసరి గరిష్ట సంపాదన రూ.5000 లోపే ఉంది.
  • 40% గ్రామీణ కుటుంబాల్లోని వారు మాన్యువల్ శ్రామికులుగానే ఉన్నారు.
  • 25% గ్రామీణ కుటుంబాలకు సొంత ఫోన్ లేదు.
  • గ్రామీణ కుటుంబాల్లో 8.29 శాతం సభ్యులు మాత్రమే నెలవారీగా 10,000 పైగా సంపాదిస్తున్నారు. 
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో షెడ్యూల్ కులాల మొత్తం జనాభా 20,13,78,086. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 15,38,50,562 మంది, పట్టణ ప్రాంతంలో 4,75,27,524 మంది ఉన్నారు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో మొత్తం జనాభా 121,08,54,977. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 16.63%

గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, ఇతర కుటుంబాల వివరాలు
వివరాలు
భారతదేశం
శాతం
ఆంధ్రప్రదేశ్
శాతం
తెలంగాణ
శాతం
ఎస్సీకుటుంబాలు
3,31,64,085
18.45
17,34,814
18.57
10,17,057
18.02
ఎస్టీ కుటుంబాలు
1,97,37,399
10.98
5,62,239
6.02
6,50,414
11.52
ఇతర కుటుంబాలు
12,31,61,662
68.50
70,43,605
75.38
39,74,328
70.42
కులం పేర్కొననివి
36,79,958
2.07
3,231
0.03
1,582
0.04

ఎక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు
1. పంజాబ్
31.9%
2. హిమాచల్‌ప్రదేశ్
25.2%
3. పశ్చిమబెంగాల్
23.5%
4. ఉత్తరప్రదేశ్
20.7%
5. హర్యానా
20.2%

తక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. మిజోరం
0.1 శాతం
2. మేఘాలయా
0.6 శాతం
3. గోవా
1.7 శాతం
4. దాద్రా, నగర్‌హవేలీ
1.8 శాతం
5. డామన్ అండ్ డయ్యూ
2.5 శాతం
  • షెడ్యూల్డ్ తెగల మొత్తం జనాభా 10,42,81,034 (8.61%)
  • షెడ్యూల్డ్ తెగల మొత్తం గ్రామీణ జనాభా 9,38,19,162

షెడ్యూల్డ్ తెగల జనాభా ఎక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. లక్షద్వీప్
94.8 శాతం
2. మిజోరం
94.4 శాతం
3. నాగాలాండ్
86.5 శాతం
4. మేఘాలయ
86.1 శాతం
5. అరుణాచల్‌ప్రదేశ్
68.8 శాతం

షెడ్యూల్డ్ తెగల జనాభా తక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు
1. ఉత్తరప్రదేశ్
0.6 శాతం
2. తమిళనాడు
1.1 శాతం
3. బిహార్
1.3 శాతం
4. కేరళ
1.5 శాతం
5. ఉత్తరాఖండ్
2.9 శాతం
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో హిందువులు 96.62 కోట్లు (79.80 శాతం).
  • 23 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువుల జనాభా శాతం ఇతర మతాల కంటే ఎక్కువగా ఉంది.
  • ముస్లింల జనాభా 17.22 కోట్లు (14.23 శాతం).
  • జమ్మూకశ్మీర్ రాష్ట్రంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ముస్లింల జనాభా ఎక్కువ శాతం ఉంది.
  • క్రైస్తవుల మొత్తం జనాభా 2.78 కోట్లు (2.30%).
  • మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో క్రైస్తవుల జనాభా ఎక్కువ శాతం ఉంది.

2011 లెక్కల ప్రకారం మతాల వారీగా జనాభా వివరాలు
మతం
జనాభా
శాతం
మెజారిటీ రాష్ట్రాలు
మెజారిటీ యు.టి
హిందువులు
96.62 కోట్లు
79.80
23
06
ముస్లింలు
17.22 కోట్లు
14.23
01
01
క్రైస్తవులు
2.78 కోట్లు
2.30
04
00
సిక్కులు
2.08 కోట్లు
1.72
01
00
బౌద్ధులు
84.43 లక్షలు
0.70
00
00
జైనులు
44.52 లక్షలు
0.37
00
00
ఇతర మతాలు
79.38 లక్షలు
0.66
00
00
ఏ మతం పేర్కొనని వారు
29.67 లక్షలు
0.24
00
00
మొత్తం
121.08 కోట్లు
100
29
07

ఆధారం: సామాజిక, ఆర్థిక, కుల గణన-2011

No comments:

Post a Comment