Indian Science Congress: గ్లోబల్ లీడర్లుగా ఎదగండి.. సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపు
భారత్ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు.

సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లను రీసెర్చ్ ల్యాబ్లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు.
No comments:
Post a Comment