సెప్టెంబరు - 12
|
ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని 1,400 విశ్వవిద్యాలయాలను పరిశీలించి 2020 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో 56 భారతీయ విద్యాసంస్థలు నిలిచినప్పటికీ ఏవీ 300లోపు ర్యాంకు దక్కించుకోలేకపోయాయి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సాధించిన 301- 350 ర్యాంకే భారతీయ విద్యాసంస్థలకు దక్కిన అత్యుత్తమ ర్యాంకు. భారత్ నుంచి 1000+ ర్యాంకుల్లో 56 విద్యాసంస్థలు నిలవగా అందులో తొలి 9 స్థానాలను ఐఐఎస్ఈ, ఐఐటీలే దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఐఐటీ టాప్లో నిలిచింది. ఈ సంస్థ భారత్లో 16వ స్థానంలో నిలవగా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 24వ స్థానాన్ని దక్కించుకుంది. ఈసారి భారతీయ విద్యాసంస్థల్లో తొలిస్థానంలో నిలిచిన బెంగుళూరు ఐఐఎస్ఈ ర్యాంకు నిరుటి కంటే పడిపోయింది. 2019లో 251-300 మధ్య ప్రపంచర్యాంకు దక్కగా ఈసారి 301-350కి చేరింది. విద్యాబోధనలో సంస్థ పనితీరు, పరిశోధన, విజ్ఞాన బదిలీ, ఇంటర్నేషనల్ ఔట్లుక్ ఆధారంగా ర్యాంకులు నిర్ధారించారు. వరుసగా నాలుగో ఏడాది కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది.
|
|
|
No comments:
Post a Comment