అమ్మ ఒడి పథకం యధాతథంగా అమలు చేస్తాం..నగదు ప‌డే తేదీ ఇదే: ఆదిమూలపు సురేష్‌

 అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

జ‌న‌వ‌రి 9వ తేదీన‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవో నంబర్‌ 3 విడుదల చేశామని.. 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామన్నారు. జ‌న‌వ‌రి 11వ తేదీన‌ తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.


No comments:

Post a Comment