కరెంట్ అఫైర్స్ సెప్టెంబరు - 10

సెప్టెంబరు - 10
¤ క్లౌడ్‌ బేస్డ్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ఉపయోగించి నీరు ఆదా చేసే ప్రక్రియను రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించింది. ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ (ఐఐఎంఎస్‌) తో పని చేసే నీటిపారుదల వ్యవస్థను విమానాశ్రయంలోని 8.4 కి.మీ. ప్రధాన రహదారి పొడవునా జీఎంఆర్‌ ఏర్పాటు చేసింది. దీంతో 80 ఎకరాల్లో ఉన్న చెట్లు, మొక్కలకు నీటిని అందించడంతోపాటు 35 శాతం వరకు నీరు ఆదా చేస్తున్నారు. దేశంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి.

No comments:

Post a Comment