చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె-5 చంద్రుడి మీద మట్టిని సేకరించింది.
ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు డిసెంబర్ 2న వెల్లడించారు. దీంతో చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి.
చైనా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...
- చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతంనుంచి చాంగె-5 మట్టిని సేకరించింది.
- ఈ సేకరణలో భాగంగా ల్యాండర్ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించింది.
- మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోంది.
- దాదాపు రెండు కేజీల మట్టిని చాంగె-5 సేకరించింది.
- చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించింది.
ఏ రాకెట్ ద్వారా చాంగె-5 నింగిలోకి దూసుకెళ్లింది?
చంద్రుడిపై జెండా పాతిన రెండో దేశం?
No comments:
Post a Comment